Reliance Just Dial : జస్ట్‌ డయల్‌‌తో రిలయన్స్‌ బిగ్ డీల్..

News

ప్రముఖ దేశీయ దేశీ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (RRVL‌) జస్ట్‌ డయల్‌ (Just Dial) మధ్య భారీ డీల్ కుదిరింది. డీల్‌ విలువ సుమారు రూ.3,497 కోట్లుగా అంచనా.

Reliance Just Dial Deal : ప్రముఖ దేశీయ దేశీ ఆన్‌లైన్‌ కామర్స్‌ మార్కెట్‌లో రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ (RRVL‌) జస్ట్‌ డయల్‌ (Just Dial) మధ్య భారీ డీల్ కుదిరింది. డీల్‌ విలువ సుమారు రూ.3,497 కోట్లుగా అంచనా. జస్ట్ డెయిల్ నుంచి 40.95 శాతం వాటాలు కొనుగోలు చేయనుంది. ఈ మేరకు నివేదిక వెల్లడించింది. సెబీ టేకోవర్‌ నిబంధనల ప్రకారం.. మరో 26శాతం వాటాను 2.17 కోట్ల షేర్ల ఓపెన్‌ ఆఫర్‌ అందిస్తోంది.

Just Dial వ్యవస్థాపకుడు VSS మణిమేనేజింగ్‌ డైరెక్టర్, సీఈవోగా కొనసాగుతారని RRVL వెల్లడించింది. జస్ట్‌ డయల్‌లో ఇన్వెస్ట్‌ చేసే నిధుల ద్వారా లోకల్‌ లిస్టింగ్, కామర్స్‌ ప్లాట్‌ఫాంగా సేవలు అందించనుంది. లక్షల భాగస్వామ్య వ్యాపార సంస్థలకు డిజిటల్‌ డీల్‌ ప్రయోజనకరంగా ఉంటుందని RRVL డైరెక్టర్‌ ఈషా అంబానీ తెలిపారు.

లక్ష్యాల సాధనకు, వ్యాపార పురోగతికి రిలయన్స్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రయోజనకరంగా ఉంటుందని మణి పేర్కొన్నారు. రెండు కంపెనీల మధ్య ఒప్పందం ప్రకారం.. రూ. 2.12 కోట్ల ఈక్విటీ షేర్లను రూ.1,022.25 రేటు చొప్పున ప్రిఫరెన్షియల్‌ ప్రాతిపదికన RRVLకు కేటాయించనున్నారు. వీఎస్‌ఎస్‌ మణి నుంచి షేరు రూ.1,020 రేటు చొప్పున RRVL రూ.1.31 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది.

జస్ట్‌ డయల్‌ కు సంబంధించి వ్యాపార నిర్వాహణ కార్యకలాపాలు 1996 సంవత్సరంలో ప్రారంభమయ్యాయి. మొబైల్, యాప్స్, వెబ్‌సైట్, టెలిఫోన్‌ హాట్‌లైన్‌ వంటి ద్వారా జస్ట్‌డయల్‌ సర్వీసులను పొందే యూజర్ల సంఖ్య 3 నెలల సగటు సుమారు రూ.13 కోట్ల వరకు పెరిగినట్టు అంచనా.

Related Posts

News

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.

News

యాప్ స్టోర్, Nfc, iMessage: కొత్త యూరోపియన్ నియమాల కారణంగా తదుపరి ఐఫోన్ ఎలా మారుతుందో ఇక్కడ ఉంది

డిజిటల్ మార్కెట్ల చట్టం 2023లో అమల్లోకి వస్తుంది మరియు వచ్చే ఏడాది పూర్తిగా అమలులోకి వస్తుంది. EU దేశాల్లో, ఈ రోజు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలపై అనేక ఆంక్షలను తొలగించాల్సిందిగా Appleని ఒత్తిడి

News

RBI: కరెన్సీ నోట్లపై దేవతల చిత్రాలు సాధ్యమేనా..? రిజర్వు బ్యాంకు నిబంధనలు ఏం చెబుతున్నాయి..?

దేశంలో అమలులో ఉన్న కరెన్సీ నోట్లపై మహాత్మా గాంధీ ఫోటోతో పాటు ఇతర ఫోటోలు ముద్రించాలనే డిమాండ్ పై రిజర్వు బ్యాంకు ఇండియా 2010లోనే స్పష్టత ఇచ్చింది. దేశంలోని పలువురు ప్రముఖుల చిత్రాలు, నోబెల్

News

Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..

రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో.. మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే మీకో ముఖ్య గమనిక. రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు