Indian Railway: వేరొకరి టికెట్‌పై రైల్లో ప్రయాణించవచ్చు.. ఎలాగో తెలుసా..

News

రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో.. మీరు తరచూ రైలు ప్రయాణాలు చేస్తుంటారా.? అయితే మీకో ముఖ్య గమనిక. రైల్లో వేరొకరి టికెట్‌పై మీరు ప్రయాణం చేయవచ్చు. మీకు టికెట్ బుక్ కాకపోయినా.. ఈ సౌకర్యంతో ఈజీగా ప్రయాణం చేసేయొచ్చు. మరి అదెలాగో తెలుసుకుందాం..

ఇండియన్ రైల్వేస్ తాజాగా ఓ నిబంధన అమలులోకి తీసుకొచ్చింది. మీ కుటుంబం సభ్యుల టికెట్‌పై ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది. అయితే మీరు ఎవరి టికెట్‌పై ప్రయాణించాలని అనుకుంటున్నారో.. వారు మీకు రక్త సంబంధీకులై ఉండాలి. ఉదాహరణకు, తల్లిదండ్రులు, తోబుట్టువులు, జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట టికెట్ ఉంటే మీరు వారి టికెట్‌పై సులభంగా ప్రయాణించవచ్చు. అయితే దీనికంటూ ఓ ప్రక్రియ ఉంది.

మొదట ప్రయాణించాల్సిన వ్యక్తి పేరు బదులుగా.. ఎవరైతే ఆ టికెట్‌పై ప్రయాణించాలనుకుంటున్నారో.. అతడి పేరును నమోదు చేయాల్సి ఉంటుంది. దీని కోసం ట్రైన్ బయల్దేరే 24 గంటల ముందుగా మీరు సంబంధిత రైల్వే అధికారులకు అవసరమైన డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలి. వాటిని అధికారులు పరిశీలించి.. ఆ తర్వాత టికెట్‌పై ప్రయాణించాల్సిన సభ్యుడి పేరును ఉంచుతారు.

అలాగే విద్యాసంస్థల విద్యార్థులకు టికెట్ బదిలీ సౌకర్యాన్ని కూడా భారతీయ రైల్వే అందిస్తోంది. అటువంటి పరిస్థితిలో బయలుదేరడానికి 48 గంటల ముందు అవసరమైన పత్రాలతో లెటర్‌హెడ్‌పై ఇనిస్టిట్యూట్ హెడ్ రాతపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటే.. దాన్ని రైల్వే అధికారులు పరిశీలిస్తారు. ఆ తర్వాత మీకు టికెట్ కన్ఫర్మ్ చేస్తారు. పండుగ సమయంలో సొంతూళ్లకు వెళ్లేవారికి రైలు టికెట్ల కన్ఫర్మేషన్‌ పెద్ద సమస్యగా మారుతోంది. 2-3 నెలల ముందే టికెట్ తీసుకున్నా వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉండటం జరుగుతోంది. అయితే ఈ సమస్యను వికల్ప్ పధకం ద్వారా పరిష్కరించవచ్చు.

Related Posts

News

ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా జియో తరవాత టెలికాం ధరలు పెంచనున్నాయి

భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ మరియు వోడాఫోన్ ఐడియా లిమిటెడ్, రిలయన్స్ జియో ప్రకటించిన కొత్త అపరిమిత ప్రణాళికలు జూలై 3 నుండి అమల్లోకి రావడంతో టెలికాం ధరలు పెంచనున్నారు, ఈ పరిణామంతో పరిíణితులైన వ్యక్తులు

News

భారతదేశ నికర ఎఫ్‌డీఐ 62% పడిపోవడానికి PE నిధులు కారణమా?

హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు మరియు ఫండ్ మేనేజర్ సమీర్ అరోరా మాట్లాడుతూ, ప్రైవేట్ ఈక్విటీ (PE) ఉపసంహరణలు కొంతవరకు భారతదేశంలో నికర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 2023-24 ఆర్థిక సంవత్సరంలో (FY24) $10.58

News

ఆదాని పోర్ట్స్ షేర్లు మార్చిలో నెలవారీ కార్గో వాల్యూమ్స్ తమ గరిష్ఠానికి చేరుకోవడంతో రికార్డ్ స్థాయికి ఎగసింది

ఆదాని పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ యొక్క షేర్లు సోమవారం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి, మార్చి 2024లో దాని అత్యధిక నెలవారీ కార్గో వాల్యూమ్స్ 38 మిలియన్ మెట్రిక్ టన్నుల పైన

News

వ్యాపార ఆలోచన: జ్యూస్ వ్యాపారంతో ఒక నెల లో.. రూ.1.5 లక్షల ఆదాయం..!

జ్యూస్ వ్యాపారం ఒక కొన్ని ప్రారంభిక ఖచ్చితంగా ఆర్థిక అవకాశం ఉంటుంది. ఇది సులభంగా ప్రారంభించబడినప్పుడు, మరియు కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని పొందగలరు.
ఆహారం మరియు పోషకాల ప్రాధాన్యత తెలుసుకోవడం అనేకంగా మానవులకు తెలుసు. ఆదివారం