సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

News

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు మరింత సౌకర్యాలు అందిస్తుండటంతో ఈ రైళ్లలో ప్రయాణించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. కానీ, సికింద్రాబాద్-నాగ్‌పూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ మాత్రం అందుకు భిన్నంగా, ఖాళీ సీట్లతో నడుస్తోంది. ఈ రైల్లో 80 శాతానికి పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి, దీని వల్ల రైల్వే అధికారులు ఆశ్చర్యంలో మునిగిపోయారు.

ఈ రూట్‌ ద్వారా తెలంగాణ, మహారాష్ట్ర ప్రజలు తరచుగా ప్రయాణిస్తుంటారు. ఈ నేపధ్యంలో సెప్టెంబర్ 16న కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్-నాగ్‌పూర్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించింది. ఈ రైలు ద్వారా రెండు రాష్ట్రాల మధ్య వాణిజ్య, పారిశ్రామిక సంబంధాలను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా విదర్భ, రామగుండం, కాజీపేట వంటి పారిశ్రామిక నగరాలను అనుసంధానించే ఈ రైలుకు అనుకున్న స్థాయిలో స్పందన రాకపోవడం అధికారులు ఆశ్చర్యపోతున్నారు. మొదట్నుంచీ ఈ రైల్లో ఎక్కువ సీట్లు ఖాళీగా ఉంటున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

ఈ రైలులో మొత్తం 1,440 సీట్లు ఉన్నప్పటికీ, 1,200కి పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అలాగే, ఎగ్జిక్యూటివ్ క్లాస్ కోచ్‌లలోనూ కేవలం 10 మంది ప్రయాణికులు మాత్రమే రిజర్వేషన్ చేసుకున్నారు. రైల్వే అధికారులు ఇప్పుడు ఈ రైలు కోచ్‌లను తగ్గించే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం 20 కోచ్‌లతో నడుస్తున్న ఈ రైలును 8 కోచ్‌లకు తగ్గించి, సీట్ల సంఖ్యను 500కు పరిమితం చేయాలని చూస్తున్నారు.

ఇదే సమయంలో సికింద్రాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం వెళ్లే వందే భారత్ రైళ్లు పూర్తిగా బుకింగ్ అయ్యాయి. ఈ రైళ్లలో ఆక్యుపెన్సీ రేట్లు 90% నుంచి 100% మధ్య ఉన్నాయి. విశాఖపట్నం వందే భారత్ రైల్లో టిక్కెట్లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉండటం విశేషం.

ఈ రైలు సికింద్రాబాద్-నాగ్‌పూర్ మార్గంలో కాజీపేట, రామగుండం వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది. మొత్తం 7.15 గంటల్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది.

రైల్వే అధికారులు ప్రయాణికుల తక్కువ స్పందనను దృష్టిలో ఉంచుకొని, రైలు సేవలను సవరించే నిర్ణయానికి వచ్చారు

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా

News

జొమాటో “ఇంటర్సిటీ లెజెండ్స్” సేవలు ముగిసినట్లు ప్రకటించింది

ఇండియాలోని పది నగరాల ప్రసిద్ధ వంటకాలను దేశవ్యాప్తంగా అందించే “ఇంటర్సిటీ లెజెండ్స్” సేవలను జొమాటో తక్షణమే ముగిసినట్లు ప్రకటించింది. ఈ సేవ, జూలైలో తాత్కాలికంగా నిలిపివేసి, కొన్ని మార్పులతో తిరిగి ప్రారంభించినప్పటికీ, ఆర్డర్లను లాభదాయకంగా