Standing instructions: ఆర్బీఐ తీసుకొస్తున్న కొత్త మార్పులతో మీ జేబుపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

Business

క్రెడిట్, డెబిట్ కార్డులు, వాలెట్లపై స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్లకు సంబంధించి అక్టోబరు ఒకటి నుంచి పలు కీలక మార్పులు జరగబోతున్నాయి.

ఈ మార్పులతో మీ బిల్లు చెల్లింపులు ప్రభావితం అవుతాయి. ఈ అంశంపై వచ్చే అనేక సందేహాలకు హైదరాబాద్‌కి చెందిన ఆర్ధిక, పెట్టుబడుల నిపుణులు నాగేంద్ర సాయి బీబీసీ ప్రేక్షకులకు అందించిన సమాధానాలు చూద్దాం. మన అవసరాల కోసం రకరకాల కంపెనీలకు బిల్లులు కడతాం. కరెంటు, ఫోన్, ఇంటర్నెట్, ఓటీటీ వీడియో సేవలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, పిల్లల చదువుల కోసం వివిధ యాప్‌లు.. ఇలా చాలా వాటికి డబ్బు చెల్లిస్తాం. కొన్నిటిని నెలకు, కొన్ని మూడు నెలలకూ, కొన్ని ఏడాదికి ఒకసారి చెల్లిస్తాం. మనం ఆ బిల్లు సమయానికి చెల్లించడం మర్చిపోతే ఆ సర్వీసు ఆగిపోతుంది. ఆలస్యం అయితే అదనపు చార్జీ పడుతుంది. అలా కాకుండా ఆ బిల్లు మనకు అందగానే, మన క్రెడిట్ లేదా డెబిట్ కార్డు నుంచో లేదా మన వ్యాలెట్ నుంచో నేరుగా ఆ బిల్లు మొత్తం కట్ అయ్యేలా ఒక ఏర్పాటు చేయవచ్చు. దీన్నే స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటారు. ఆటో డెబిట్ అనే పేరుతో ఇది పాపులర్.

ఆన్‌లైన్లో జరిగే ప్రతీ వాయిదాకీ అడిషినల్ ఫాక్టర్ అథెంటికేషన్ (రెండుసార్లు ఓకే చెప్పడం) (ఓటీపీ ద్వారా) ఉండాలనేది ఆర్బీఐ నిబంధన. కానీ, ఈ స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్న సందర్భంలో బిల్లు వసూలు చేసే కంపెనీ వారు ఇలా డబుల్ ఓకే లేకుండానే నెలనెలా డబ్బు వసూలు చేసుకోవచ్చు. ఇకపై ఆ పద్ధతి చెల్లదని ఆర్బీఐ నిర్ణయించింది. అంటే మనం ఆన్‌లైన్లో చెల్లించే ప్రతీసారీ మనం ఓటీపీ ఎంటర్ చేసి ఓకే చేస్తేనే డబ్బు మన కార్డ్ నుంచి కట్ అయ్యేలా ఉండాలనేది ఆర్బీఐ కొత్త రూల్. దీనివల్ల కష్టమర్లకు భరోసా, భద్రత ఉంటుందనేది ఆర్బీఐ విధానం.

వాస్తవానికి 2020వ సంత్సవరం నుంచీ ఆర్బీఐ ఇందు కోసం ప్రయత్నం చేస్తోంది. 2021 ఏప్రిల్ 1 నుంచి ఇది అమలు కావాల్సి ఉంది. కానీ అప్పటికి చాలా బ్యాంకులు ఈ విషయమై సాఫ్ట్‌వేర్ పరంగా సిద్ధం కాలేదు. దీంతో బ్యాంకుల సంఘం వారి విజ్ఞప్తి మేరకు అమలును వాయిదా వేసింది ఆర్బీఐ. తాజాగా 2021 అక్టోబరు 1 నుంచి ఈ విధానం అమల్లోకి వస్తుంది. ఇప్పటికే 75 శాతానికి పైగా బ్యాంకులు ఈ విధానానికి సన్నద్ధం అయ్యాయి. మిగిలిన చిన్నా చితకా బ్యాంకులు మాత్రం ఇంకా సిద్ధం కాలేదు. ఆ బ్యాంకుల ఖాతాదారులకు కాస్త ఇబ్బంది తప్పక పోవచ్చు. అయితే అన్ని ప్రధాన ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఈ పద్ధతికి రెడీగా ఉన్నాయి. చాలా వరకూ బ్యాంకులు, కార్డ్ కంపెనీలు (మాస్టర్, వీసా, రూపే) వారు తమ సర్వర్లలో మార్పులు ఇప్పటికే చేశారు. అంతేకాదు తమ కష్టమర్లకు ఈ విషయమై మెసేజీలు, మెయిల్స్ కూడా పంపారు. భారతదేశంలో సుమారు 90 కోట్ల వరకూ క్రెడిట్, డెబిట్ కార్డులుంటాయని అంచనా. వాటన్నిటికీ ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే మొబైల్ వ్యాలెట్లు (పేటీఎం, మొబి క్విక్ మొదలైనవి) వాటికి కూడా ఈ నిబంధన వర్తిస్తుంది.

Related Posts

Business

బైజూస్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి

భారతదేశంలోని ఒక న్యాయవాద న్యాయస్థానం మంగళవారం భారతదేశంలో అత్యంత విలువైన స్టార్టప్ అయిన బైజూస్‌కు దివాళా నడిపింపులు ప్రారంభించాయి, ఇది దేశ క్రికెట్ బోర్డు నుండి వచ్చిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా. ఈ తీర్పు యాంత్రిక

Business

టాటా మోటార్స్ Q1 అప్‌డేట్: గ్లోబల్ హోల్‌సేల్స్‌లో 2% వృద్ధి

టాటా మోటార్స్ గ్లోబల్ హోల్‌సేల్స్ 2024 జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో 329,847 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది ఏడాది కాలంలో 2 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం ఎక్స్చేంజ్‌లకు

Business

టాటా మోటార్స్: లాభాల లక్ష్యం 1089 రూపాయలు

మేము టాటా మోటార్స్ వార్షిక విశ్లేషకుల సమావేశంలో పాల్గొన్నాము, అక్కడ కంపెనీ తన వాణిజ్య వాహనాలు (CV), ప్రయాణికుల వాహనాలు (PV) మరియు విద్యుత్ వాహనాలు (EV) వ్యాపారాల సమగ్ర దృష్టాంతాన్ని మరియు వారి

Business

లాభం తెచ్చిన Suzlon స్టాక్ 52.48 రూపాయిల వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది: కంపెనీ ఆర్డర్ బుక్ 3.3 గిగావాట్ల వద్ద నిలిచింది, 1,035.15 మెగావాట్ల ఆర్డర్లు పొందింది

ఇండియా మార్కెట్లు ఈ రోజు నష్టంతో ప్రారంభమయ్యాయి, BSE సెన్సెక్స్ సూచిక 2.70 శాతం, NSE నిఫ్టీ-50 సూచిక 2.25 శాతం తగ్గింది. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ, ఒక మల్టీబాగర్ స్టాక్ 4.34 శాతం