Smart Prepaid Meters: స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయ్‌.. ముందే రీచార్జ్ చేసుకోవాలి.. లేదంటే క‌రెంటు ఉండ‌దు..!

Business

Smart Prepaid Meters: కేంద్ర స‌ర్కార్ విద్యుత్ రంగంలో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. కొత్త‌గా స్మార్ట్ మీటర్లను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా కరెంటు..

Smart Prepaid Meters: కేంద్ర స‌ర్కార్ విద్యుత్ రంగంలో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. కొత్త‌గా స్మార్ట్ మీటర్లను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా కరెంటు వినియోగదారులు ముందుగానే డబ్బులు కట్టాల్సి రావ‌చ్చ‌నే అంచ‌నాలు ఉన్నాయి. అంటే డబ్బులు కట్టి కరెంటు వాడుకోవాల్సి ఉంటుంద‌న్న‌ట్లు. ప్రస్తుతం మనం నెలంతా కరెంటు ఉపయోగించుకొని, బిల్లు వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిస్తున్నాం. కానీ కొత్త స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత మీరు ముందుగానే మీ కరెంటు మీటరును రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఎంత మొత్తానికి అయితే మీరు రీచార్జ్ చేసుకుంటారో.. ఆ మొత్తం వరకు మీరు కరెంటు వాడుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇక నివేదికల ప్రకారం.. రీచార్జ్ మొత్తం అయిపోయిన వెంటనే మీ ఇంట్లోకి కరెంటు స‌ర‌ఫ‌రా నిలిచిపోయే అవ‌కాశం ఉంటుంది. మళ్లీ మీరు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే రీచార్జ్ చేసుకుంటేనే మీరు కరెంటు ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం ప్రకారం.. 2023 డిసెంబర్, 2025 మార్చి నాటికి రెండు విడతల్లో దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రైతులకు మినహాయించి మిగతా వారందరికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాల‌నే యోచ‌న‌లో ఉంది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇలాంటి స‌దుపాయం వ‌చ్చిన త‌ర్వాత క‌రెంటును పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా పొదుపుగా వాడుకున్నా.. ఎంత బిల్లు వ‌చ్చిన త‌ర్వాత క‌ట్టాల్సి ఉంటుంది. క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిచిపోయే అవ‌కాశం ఉండ‌దు. ఈ స్మార్ట్ మీట‌ర్లు వ‌స్తే ముందుగా రీఛార్జ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఒక‌వేళ రీఛార్జ్ అయిపోతే క‌రెంటు నిలిచిపోతుంది. సామాన్య ప్ర‌జ‌ల‌కు స‌మ‌యానికి చేతిలో డ‌బ్బులు లేక రీఛార్జ్ చేసుకోలేని ప‌రిస్థితి ఉంటే ఇంట్లో చీక‌టిలోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

Related Posts

Business

బైజూస్‌కు సమస్యలు ఎదురవుతున్నాయి

భారతదేశంలోని ఒక న్యాయవాద న్యాయస్థానం మంగళవారం భారతదేశంలో అత్యంత విలువైన స్టార్టప్ అయిన బైజూస్‌కు దివాళా నడిపింపులు ప్రారంభించాయి, ఇది దేశ క్రికెట్ బోర్డు నుండి వచ్చిన పిటిషన్‌కు ప్రతిస్పందనగా. ఈ తీర్పు యాంత్రిక

Business

టాటా మోటార్స్ Q1 అప్‌డేట్: గ్లోబల్ హోల్‌సేల్స్‌లో 2% వృద్ధి

టాటా మోటార్స్ గ్లోబల్ హోల్‌సేల్స్ 2024 జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో 329,847 యూనిట్లకు చేరుకున్నాయి, ఇది ఏడాది కాలంలో 2 శాతం వృద్ధిని సూచిస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ సోమవారం ఎక్స్చేంజ్‌లకు

Business

టాటా మోటార్స్: లాభాల లక్ష్యం 1089 రూపాయలు

మేము టాటా మోటార్స్ వార్షిక విశ్లేషకుల సమావేశంలో పాల్గొన్నాము, అక్కడ కంపెనీ తన వాణిజ్య వాహనాలు (CV), ప్రయాణికుల వాహనాలు (PV) మరియు విద్యుత్ వాహనాలు (EV) వ్యాపారాల సమగ్ర దృష్టాంతాన్ని మరియు వారి

Business

లాభం తెచ్చిన Suzlon స్టాక్ 52.48 రూపాయిల వద్ద 52 వారాల గరిష్ఠాన్ని తాకింది: కంపెనీ ఆర్డర్ బుక్ 3.3 గిగావాట్ల వద్ద నిలిచింది, 1,035.15 మెగావాట్ల ఆర్డర్లు పొందింది

ఇండియా మార్కెట్లు ఈ రోజు నష్టంతో ప్రారంభమయ్యాయి, BSE సెన్సెక్స్ సూచిక 2.70 శాతం, NSE నిఫ్టీ-50 సూచిక 2.25 శాతం తగ్గింది. మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ, ఒక మల్టీబాగర్ స్టాక్ 4.34 శాతం