RBI: క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నారా.. టెన్షన్ వద్దు.. ఈ కొత్త రూల్‌ తెలుసుకోండి..

Business

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా.? దాని బిల్లును సకాలంలో చెల్లిస్తున్నారా.? లేక ఎప్పుడూ ఆలస్యంగానే బిల్లు పే చేస్తున్నారా.?

మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉందా.? దాని బిల్లును సకాలంలో చెల్లిస్తున్నారా.? లేక ఎప్పుడూ ఆలస్యంగానే బిల్లు పే చేస్తున్నారా.? ఒకవేళ మీరు క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తున్నట్లయితే.. టెన్షన్ వద్దు.. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన తీసుకొచ్చింది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమయానికి డబ్బులు అకౌంట్‌లో లేకపోయినా.. ఏదైనా అత్యవసరం పడటమో.. లేదా మర్చిపోయినా.. ఇలా కారణాలు ఏదైనా కొంతమంది అప్పుడప్పుడూ క్రెడిట్ కార్డు బిల్లును ఆలస్యంగా చెల్లిస్తుంటారు. ఇక అలా చేయడం వల్ల ఆలస్య రుసుము, అదనపు వడ్డీ బిల్లుతో సహా ఎక్స్‌ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది. దీంతో సిబిల్ స్కోర్‌లో కూడా కోత పడుతుందని టెన్షన్ పడుతుంటారు. ఇకపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ కొత్త రూల్‌ను అమలులోకి తీసుకొచ్చింది.

క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు.. బకాయి రోజుల సమాచారాన్ని క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు ఇవ్వాలని.. పాస్ట్ డ్యూ డేట్ మూడు రోజులు దాటితేనే.. ఖాతాదారుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని పేర్కొంది. దీని బట్టి చూస్తే.. బిల్లు చెల్లించే డేట్ దాటినా.. మూడు రోజుల్లోపు ఖాతాదారులు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా తమ బిల్లులు చెల్లించవచ్చు. లాస్ట్ డేట్ దాటిన మూడు రోజుల తర్వాత కూడా క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించకపోతేనే అదనపు ఛార్జీలు, ఆలస్య రుసుము వంటివి విధిస్తారు.

Related Posts

Business

అసెంబ్లింగ్‌ ప్రాసెస్‌ను ఫాక్స్‌కాన్‌ స్టార్ట్‌ చేసుకోగానే ఇండియాలో ఐఫోన్‌ 15 తయారీ ప్రారంభం!

అప్పుడుగా, ఆపిల్‌ కంపెనీ సమాచారాన్ని ముఖ్యమైన పత్రికలు మరియు టెక్నాలజీ బ్లాగులలో ప్రచురించాయి. ఐఫోన్‌ 15 అంతర్గత ప్రముఖ మార్పులు చేస్తున్నాయని, ఈ మోడల్‌లో కెమెరా సిస్టమ్‌ను భారీగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నారు. ప్రో

Business

Public Provident Fund: పీపీఎఫ్‌లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? దాని వల్ల అన్ని ప్రయోజనాలున్నాయా? వివరాలు తెలుసుకోండి..

ఇప్పటివరకూ 12 త్రైమాసికాలుగా పీపీఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. అయినప్పటికీ ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. దీని వల్ల లాభాలే గానీ నష్టం ఉండదని నిపుణులు చెబుతున్న మాట.అందుకు గల కారణాలు

Business

Mota-Engil ప్రధాన లాభాలతో PSI 0.28% పెరిగింది

PSI ఇండెక్స్ 0.28% పురోగమించి 5,923.57 పాయింట్లకు చేరుకోవడంతో లిస్బన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈరోజు సానుకూలంగా ముగిసింది మరియు వరుసగా రెండవ రోజు Mota-Engil అగ్రస్థానంలో ఉంది.
PSIని కలిగి ఉన్న 15 లిస్టెడ్ కంపెనీలలో,

Business

ఇటాపై లుఫ్తాన్స వేగవంతం చేసింది: 40 శాతం వాటా కోసం €200 మిలియన్ సిద్ధంగా ఉంది

జర్మన్ల రెండు-దశల ప్రణాళిక: మొదట ప్రభుత్వం నియంత్రణను కలిగి ఉంటుంది
లుఫ్తాన్స ఇటా ఎయిర్‌వేస్‌లో 40 నుండి 49 శాతం వాటాను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది మరియు తరువాత దశలో దానిని పెంచడానికి సిద్ధంగా