మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..! అయితే నవంబర్‌ 30 లోపు 5లక్షలు మీ సొంతం..

Business

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్యాంకులలో ఫ్రాడ్‌ జరగడం వల్ల రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) వీటిని నిషేధించింది. దీంతో ఈ బ్యాంకు డిపాజిటర్లు నష్టపోకుండా ఉండేందుకు త్వరలో ఒక సెటిల్‌మెంట్ చేయనుంది. వచ్చే 90 రోజుల్లో డిపాజిటర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని సెప్టెంబర్ 1న ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నవంబర్ 30, 2021 వరకు డిపాజిటర్లు వారి డబ్బును తిరిగి పొందవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 27 న సర్క్యులర్ జారీ చేసింది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం, 2021 సెక్షన్ 1 ప్రకారం సబ్ సెక్షన్ (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సెప్టెంబర్ 1వ తేదీన అమలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఆ డిపాజిటర్లందరు రూ.5 లక్షలు పొందుతారు. అయితే బ్యాంక్ డిపాజిట్ గ్యారెంటీ చట్టం ఆమోదం పొందకముందే మారటోరియంపై నడుస్తున్న బ్యాంకుల డిపాజిటర్లకు కూడా రూ.5 లక్షలు అందుతాయి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ మారటోరియంలో నడుస్తున్న బ్యాంకులలో గుణలోని గ్రాహా కో-ఆపరేటివ్ బ్యాంక్, మధ్యప్రదేశ్‌కు చెందిన దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, విజయవాడ, నాసిక్‌లోని ఇండిపెండెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.

ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ 90 రోజుల కాలాన్ని 45-45 రోజులుగా విభజించింది. బ్యాంకులు మొదటి 45 రోజుల్లో తమ డిపాజిటర్ల రికార్డులను సేకరించి ఈ సమాచారాన్ని DICGC కి ఇస్తాయి. మిగతా 45 రోజుల్లో DICGC అన్ని క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తూ వస్తుంది. రూ.5 లక్షలు కస్టమర్లకు తిరిగి చెల్లిస్తుంది. గతంలో బ్యాంకులు ముంచేసిన డబ్బులు పొందడానికి 8-10 సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు అదే పని 90 రోజుల్లో కంప్లీట్‌ అవుతుందని ఇటీవల ఆర్థిక మంత్రి తెలిపారు. ఖాతాదారులకు 5 లక్షల రూపాయలు, బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్‌, వడ్డీ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కువగా PMC బ్యాంక్ దీని ప్రయోజనాన్ని పొందుతుంది.

Related Posts

Business

అసెంబ్లింగ్‌ ప్రాసెస్‌ను ఫాక్స్‌కాన్‌ స్టార్ట్‌ చేసుకోగానే ఇండియాలో ఐఫోన్‌ 15 తయారీ ప్రారంభం!

అప్పుడుగా, ఆపిల్‌ కంపెనీ సమాచారాన్ని ముఖ్యమైన పత్రికలు మరియు టెక్నాలజీ బ్లాగులలో ప్రచురించాయి. ఐఫోన్‌ 15 అంతర్గత ప్రముఖ మార్పులు చేస్తున్నాయని, ఈ మోడల్‌లో కెమెరా సిస్టమ్‌ను భారీగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నారు. ప్రో

Business

Public Provident Fund: పీపీఎఫ్‌లోనే ఎందుకు పెట్టుబడి పెట్టాలి? దాని వల్ల అన్ని ప్రయోజనాలున్నాయా? వివరాలు తెలుసుకోండి..

ఇప్పటివరకూ 12 త్రైమాసికాలుగా పీపీఎఫ్ వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం పెంచలేదు. అయినప్పటికీ ఈ పథకంలో పెట్టుబడులు పెట్టవచ్చు. దీని వల్ల లాభాలే గానీ నష్టం ఉండదని నిపుణులు చెబుతున్న మాట.అందుకు గల కారణాలు

Business

Mota-Engil ప్రధాన లాభాలతో PSI 0.28% పెరిగింది

PSI ఇండెక్స్ 0.28% పురోగమించి 5,923.57 పాయింట్లకు చేరుకోవడంతో లిస్బన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఈరోజు సానుకూలంగా ముగిసింది మరియు వరుసగా రెండవ రోజు Mota-Engil అగ్రస్థానంలో ఉంది.
PSIని కలిగి ఉన్న 15 లిస్టెడ్ కంపెనీలలో,

Business

ఇటాపై లుఫ్తాన్స వేగవంతం చేసింది: 40 శాతం వాటా కోసం €200 మిలియన్ సిద్ధంగా ఉంది

జర్మన్ల రెండు-దశల ప్రణాళిక: మొదట ప్రభుత్వం నియంత్రణను కలిగి ఉంటుంది
లుఫ్తాన్స ఇటా ఎయిర్‌వేస్‌లో 40 నుండి 49 శాతం వాటాను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది మరియు తరువాత దశలో దానిని పెంచడానికి సిద్ధంగా