Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. సిప్, లంప్సమ్‌లో ఏది బెటర్..

News

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..

ప్రస్తుతం స్టాక్ మార్కెట్(Stock Market) సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకమొత్తంలో(lumpsum) ఇన్వెస్ట్ చేయాలా లేక సిప్(SIP) సాయంతో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల మదిలో మెదులుతోంది. పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు.

మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉంటే, పెట్టుబడిదారులు దానిని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి. స్మార్ట్ ఇన్వెస్టర్లు క్రమంగా మిగులు నిధులను దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని నిపుణులు అంటున్నారు. ఇది కాకుండా.. పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా ఉంచాలని కూడా పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ చింతన్ హరియా తెలిపారు. అటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులు ప్రత్యేక 12-18 నెలల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి. ఇది గొప్ప పెట్టుబడి అవకాశం. భారత ఆర్థిక వ్యవస్థ, భారత స్టాక్ మార్కెట్ పనితీరు దీర్ఘకాలికంగా బలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ మీ వద్ద మిగులు నిధులు ఉంటే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. మీకు ఇష్టమైన ఉత్పత్తి ఎప్పుడు తగ్గింపుతో లభిస్తుందో, అప్పుడు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయకూడదని వారు అంటున్నారు. వచ్చే 6-12 నెలల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.

Related Posts

News

ఆదాని పోర్ట్స్ షేర్లు మార్చిలో నెలవారీ కార్గో వాల్యూమ్స్ తమ గరిష్ఠానికి చేరుకోవడంతో రికార్డ్ స్థాయికి ఎగసింది

ఆదాని పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ యొక్క షేర్లు సోమవారం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి, మార్చి 2024లో దాని అత్యధిక నెలవారీ కార్గో వాల్యూమ్స్ 38 మిలియన్ మెట్రిక్ టన్నుల పైన

News

వ్యాపార ఆలోచన: జ్యూస్ వ్యాపారంతో ఒక నెల లో.. రూ.1.5 లక్షల ఆదాయం..!

జ్యూస్ వ్యాపారం ఒక కొన్ని ప్రారంభిక ఖచ్చితంగా ఆర్థిక అవకాశం ఉంటుంది. ఇది సులభంగా ప్రారంభించబడినప్పుడు, మరియు కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని పొందగలరు.
ఆహారం మరియు పోషకాల ప్రాధాన్యత తెలుసుకోవడం అనేకంగా మానవులకు తెలుసు. ఆదివారం

News

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.

News

యాప్ స్టోర్, Nfc, iMessage: కొత్త యూరోపియన్ నియమాల కారణంగా తదుపరి ఐఫోన్ ఎలా మారుతుందో ఇక్కడ ఉంది

డిజిటల్ మార్కెట్ల చట్టం 2023లో అమల్లోకి వస్తుంది మరియు వచ్చే ఏడాది పూర్తిగా అమలులోకి వస్తుంది. EU దేశాల్లో, ఈ రోజు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలపై అనేక ఆంక్షలను తొలగించాల్సిందిగా Appleని ఒత్తిడి