Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా.. సిప్, లంప్సమ్‌లో ఏది బెటర్..

News

ప్రస్తుతం స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు..

ప్రస్తుతం స్టాక్ మార్కెట్(Stock Market) సెంటిమెంట్ బలహీనంగా ఉండడంతో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన అవకాశమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ ప్రభావితమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏకమొత్తంలో(lumpsum) ఇన్వెస్ట్ చేయాలా లేక సిప్(SIP) సాయంతో ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలా అనే ప్రశ్న స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల మదిలో మెదులుతోంది. పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మ్యూచువల్ ఫండ్లలో ఒకేసారి పెట్టుబడి పెట్టడం మంచిది కాదు.

మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉంటే, పెట్టుబడిదారులు దానిని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి. స్మార్ట్ ఇన్వెస్టర్లు క్రమంగా మిగులు నిధులను దీర్ఘకాలికంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారని నిపుణులు అంటున్నారు. ఇది కాకుండా.. పోర్ట్‌ఫోలియోను వైవిధ్యభరితంగా ఉంచాలని కూడా పెట్టుబడిదారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ఈక్విటీ, డెట్ మ్యూచువల్ ఫండ్స్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం మార్కెట్ సెంటిమెంట్ బలహీనంగా ఉందని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ప్రొడక్ట్ హెడ్ చింతన్ హరియా తెలిపారు. అటువంటి పరిస్థితిలో పెట్టుబడిదారులు ప్రత్యేక 12-18 నెలల్లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టాలి. ఇది గొప్ప పెట్టుబడి అవకాశం. భారత ఆర్థిక వ్యవస్థ, భారత స్టాక్ మార్కెట్ పనితీరు దీర్ఘకాలికంగా బలంగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ జితేంద్ర సోలంకి మాట్లాడుతూ మీ వద్ద మిగులు నిధులు ఉంటే ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు ఇదొక గొప్ప అవకాశమన్నారు. మీకు ఇష్టమైన ఉత్పత్తి ఎప్పుడు తగ్గింపుతో లభిస్తుందో, అప్పుడు కొనుగోలు చేయడంలో ఆలస్యం చేయకూడదని వారు అంటున్నారు. వచ్చే 6-12 నెలల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆయన సూచించారు.

Related Posts

News

వారానికి 6 రోజులు పని చేయాలా? 5 రోజులు చాలు!

నేటి వేగంగా మారుతున్న జీవన విధానంలో ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతోంది. ఎక్కువసేపు పనిచేయడం వల్ల వారు కుటుంబంతో గడిపే సమయం తగ్గి, మానసిక, శారీరక ఆరోగ్యంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ నష్టం కలిగించే

News

సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌: రైల్వే షాకింగ్ నిర్ణయం

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు భారతీయ రైల్వేలోకి ప్రవేశించిన తర్వాత ప్యాసింజర్ల నుండి మంచి స్పందన లభించింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ రైళ్లకు విశేష డిమాండ్ ఉంది. వేగంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే కాకుండా, ప్రయాణికులకు

News

టాటా మోటార్స్ షేర్లు 5% కుప్పకూలాయి; UBS 20% తగ్గుదల అవకాశాన్ని చూసింది

సెప్టెంబర్ 11న ప్రారంభ ట్రేడింగ్‌లో టాటా మోటార్స్ షేర్లు దాదాపు 5 శాతం పడిపోయి, నిఫ్టీ 50లో అత్యధిక నష్టాల్లో ఒకటిగా నిలిచాయి. ఉదయం 09.52 గంటలకు టాటా మోటార్స్ షేర్లు NSEలో రూ.

News

ఆథర్ ఎనర్జీ IPOకి సిద్ధం, రూ. 3,100 కోట్ల తాజా షేర్ల విడుదలతో సహా

భారతదేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీదారు ఆథర్ ఎనర్జీ తన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) ద్వారా బహిరంగ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైంది. ఈ ఐపీఓలో రూ. 3,100 కోట్ల విలువైన తాజా