ఆత్మనిర్భర్ భారత్: మోదీ చెప్పిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజ్‌ ఏమయింది, నిధులు ఎవరికి చేరాయి? – prajaavani.com

News

కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. సోమవారం ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాలలో స్వల్ప మెరుగుదల కనిపించింది.

2020-21 ఆర్థిక సంవత్సరానికి, సుమారు 8శాతం క్షీణతను అంచనా వేయగా, ఇది 7.3 శాతం దగ్గర ఆగిపోయింది. అదే సమయంలో నాల్గవ త్రైమాసికంలో వృద్ధి రేటును 1.3 శాతంగా అంచనా వేయగా, అది 1.6 శాతం నమోదైంది. కానీ, ఈ గణాంకాల ఆధారంగా ఎకానమీ కోలుకుని, పరుగులు పెట్టే పరిస్థితి అయితే కనిపించడం లేదు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏ స్థితిలో ఉంది, దానికి ఎలాంటి చికిత్స కావాలనేది అంచనా వేయడానికి నాలుగు కొలమానాలు ఉన్నాయి. ఒకటి జీడీపీ, రెండోది నిరుద్యోగిత రేటు, మూడోది ద్రవ్యోల్బణం, నాలుగోది ప్రజలు ఖర్చు చేసే సామర్ధ్యం.

ఈ నాలుగు కొలమానాల ఆధారంగా చూసినప్పుడు గత ఏడాదికీ, ఇప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థలో పెద్దగా మార్పు లేదు. ఎకానమీకి చికిత్స చేసేందుకు మోదీ ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది కానీ, విజయవంతం కాలేదు. కాబట్టి పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. కరోనా మొదటి వేవ్‌లో భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టడానికి మోదీ ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.

సోమవారం విడుదలైన ఆర్థిక శాఖ గణాంకాలు జనవరి నుంచి మార్చి మధ్య కాలం నాటివి. కరోనా ప్రభావం పోయిందని ప్రజలు నిర్భయంగా రోడ్ల మీదకు వస్తున్న సమయం అది. కరోనాను పారదోలామని ప్రభుత్వం అప్పటికే ప్రకటనలు చేసింది. అన్ని ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు ఎత్తివేశారు. అలాంటి పరిస్థితుల్లో, మోదీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థకు ఇచ్చిన రూ.20 లక్షల కోట్ల మెగా బూస్టర్ వ్యాక్సీన్ ప్రభావం ఎంత అన్న ప్రశ్న వచ్చినప్పుడు పెద్దగా లేదు అన్న సమాధానం వస్తుంది. మరి ప్రభుత్వం ప్రకటించిన రిలీఫ్ ప్యాకేజ్ ఏమయింది…ఆ నిధులు ఎటు వెళ్లాయి, ప్రభుత్వం తాను ప్రకటించినట్లు ఖర్చు చేయగలిగిందా? చేస్తే వాటి ప్రభావం ఎంత?

Related Posts

News

ఆదాని పోర్ట్స్ షేర్లు మార్చిలో నెలవారీ కార్గో వాల్యూమ్స్ తమ గరిష్ఠానికి చేరుకోవడంతో రికార్డ్ స్థాయికి ఎగసింది

ఆదాని పోర్ట్స్ మరియు స్పెషల్ ఎకానమిక్ జోన్ లిమిటెడ్ యొక్క షేర్లు సోమవారం రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి, మార్చి 2024లో దాని అత్యధిక నెలవారీ కార్గో వాల్యూమ్స్ 38 మిలియన్ మెట్రిక్ టన్నుల పైన

News

వ్యాపార ఆలోచన: జ్యూస్ వ్యాపారంతో ఒక నెల లో.. రూ.1.5 లక్షల ఆదాయం..!

జ్యూస్ వ్యాపారం ఒక కొన్ని ప్రారంభిక ఖచ్చితంగా ఆర్థిక అవకాశం ఉంటుంది. ఇది సులభంగా ప్రారంభించబడినప్పుడు, మరియు కొన్ని ఉపయోగకరమైన సమాచారాన్ని పొందగలరు.
ఆహారం మరియు పోషకాల ప్రాధాన్యత తెలుసుకోవడం అనేకంగా మానవులకు తెలుసు. ఆదివారం

News

LPG Cylinder Price: సామాన్యులకు షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇలా..

హోలీకి ముందు సామాన్య ప్రజలకు పెట్రోలియం సంస్థలు గట్టి షాకిచ్చాయి. వంట గ్యాస్ వినియోగదారులపై మరోసారి ఆర్థిక భారం మోపాయి. గృహ వినియోగానికి ఉపయోగించే గ్యాస్ సిలిండర్‌పై రూ.50, వాణిజ్య సిలిండర్ పై రూ.

News

యాప్ స్టోర్, Nfc, iMessage: కొత్త యూరోపియన్ నియమాల కారణంగా తదుపరి ఐఫోన్ ఎలా మారుతుందో ఇక్కడ ఉంది

డిజిటల్ మార్కెట్ల చట్టం 2023లో అమల్లోకి వస్తుంది మరియు వచ్చే ఏడాది పూర్తిగా అమలులోకి వస్తుంది. EU దేశాల్లో, ఈ రోజు హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ మరియు సేవలపై అనేక ఆంక్షలను తొలగించాల్సిందిగా Appleని ఒత్తిడి