Smart Prepaid Meters: స్మార్ట్ మీటర్లు రాబోతున్నాయ్‌.. ముందే రీచార్జ్ చేసుకోవాలి.. లేదంటే క‌రెంటు ఉండ‌దు..!

Business

Smart Prepaid Meters: కేంద్ర స‌ర్కార్ విద్యుత్ రంగంలో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. కొత్త‌గా స్మార్ట్ మీటర్లను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా కరెంటు..

Smart Prepaid Meters: కేంద్ర స‌ర్కార్ విద్యుత్ రంగంలో ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టింది. కొత్త‌గా స్మార్ట్ మీటర్లను తీసుకురాబోతోంది. ఇందులో భాగంగా కరెంటు వినియోగదారులు ముందుగానే డబ్బులు కట్టాల్సి రావ‌చ్చ‌నే అంచ‌నాలు ఉన్నాయి. అంటే డబ్బులు కట్టి కరెంటు వాడుకోవాల్సి ఉంటుంద‌న్న‌ట్లు. ప్రస్తుతం మనం నెలంతా కరెంటు ఉపయోగించుకొని, బిల్లు వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్లు చెల్లిస్తున్నాం. కానీ కొత్త స్మార్ట్ మీటర్లు వచ్చిన తర్వాత మీరు ముందుగానే మీ కరెంటు మీటరును రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంద‌ని నివేదిక‌లు పేర్కొంటున్నాయి. ఎంత మొత్తానికి అయితే మీరు రీచార్జ్ చేసుకుంటారో.. ఆ మొత్తం వరకు మీరు కరెంటు వాడుకునే ఛాన్స్ ఉంటుంది.

ఇక నివేదికల ప్రకారం.. రీచార్జ్ మొత్తం అయిపోయిన వెంటనే మీ ఇంట్లోకి కరెంటు స‌ర‌ఫ‌రా నిలిచిపోయే అవ‌కాశం ఉంటుంది. మళ్లీ మీరు రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ముందుగానే రీచార్జ్ చేసుకుంటేనే మీరు కరెంటు ఉపయోగించుకోవడానికి వీలవుతుంది. ఇకపోతే కేంద్ర ప్రభుత్వపు నిర్ణయం ప్రకారం.. 2023 డిసెంబర్, 2025 మార్చి నాటికి రెండు విడతల్లో దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు అందుబాటులోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రైతులకు మినహాయించి మిగతా వారందరికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాల‌నే యోచ‌న‌లో ఉంది కేంద్ర ప్ర‌భుత్వం. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది.

ఇలాంటి స‌దుపాయం వ‌చ్చిన త‌ర్వాత క‌రెంటును పొదుపుగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు కూడా పొదుపుగా వాడుకున్నా.. ఎంత బిల్లు వ‌చ్చిన త‌ర్వాత క‌ట్టాల్సి ఉంటుంది. క‌రెంటు స‌ర‌ఫ‌రా నిలిచిపోయే అవ‌కాశం ఉండ‌దు. ఈ స్మార్ట్ మీట‌ర్లు వ‌స్తే ముందుగా రీఛార్జ్ చేసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. ఒక‌వేళ రీఛార్జ్ అయిపోతే క‌రెంటు నిలిచిపోతుంది. సామాన్య ప్ర‌జ‌ల‌కు స‌మ‌యానికి చేతిలో డ‌బ్బులు లేక రీఛార్జ్ చేసుకోలేని ప‌రిస్థితి ఉంటే ఇంట్లో చీక‌టిలోనే ఉండాల్సిన ప‌రిస్థితి ఉంటుంది.

Related Posts

Business

మార్చి 15న భారతీయ స్టాక్ మార్కెట్ నుండి ఏమి ఆశించాలి

ప్రపంచ విపరీత మార్కెట్ సూచనలను బట్టి భారతీయ స్టాక్ మార్కెట్ సూచికలు శుక్రవారం తగ్గిన స్థాయిలో ప్రారంభించబడవచ్చు.
గిఫ్ట్ నిఫ్టీ పై ట్రెండ్లు కూడా భారతీయ ప్రామాణిక సూచికకు గ్యాప్-డౌన్ ప్రారంభం సూచిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ

Business

ఆర్‌బీఐ నిబంధనలను అనుసరించడానికి టాటా సన్స్ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల పై పని చేస్తున్నారు: నివేదిక

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) చేత ఉన్న నిబంధనలను అనుసరించడానికి, ఆర్థిక సేవల సంస్థ టాటా క్యాపిటల్‌లో ఉన్న వాటాను మరొక సంస్థకు బదిలీ చేయడం ఒక ఎంపికగా టాటా సన్స్ పరిగణలో

Business

ఇండోనేషియా: టైర్లతో కొత్త వ్యాపారం.. అసలైన రిసైక్లింగ్ వ్యాపారం

రిసైక్లింగ్ వ్యాపారం అనేది అత్యంత ఆశాదాయకంగా, ప్రతి వస్తువును జాగ్రత్తగా మరియు కొత్తగా ఉపయోగించడం ఒక దొరికే అవకాశం. ఇందులో వ్యాపారాన్ని తెచ్చే ఒక కంపెనీ ఇందోనేషియాలో భూమి, నదులు కాలుష్యానికి ప్రతి వరుస

Business

అసెంబ్లింగ్‌ ప్రాసెస్‌ను ఫాక్స్‌కాన్‌ స్టార్ట్‌ చేసుకోగానే ఇండియాలో ఐఫోన్‌ 15 తయారీ ప్రారంభం!

అప్పుడుగా, ఆపిల్‌ కంపెనీ సమాచారాన్ని ముఖ్యమైన పత్రికలు మరియు టెక్నాలజీ బ్లాగులలో ప్రచురించాయి. ఐఫోన్‌ 15 అంతర్గత ప్రముఖ మార్పులు చేస్తున్నాయని, ఈ మోడల్‌లో కెమెరా సిస్టమ్‌ను భారీగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నట్లు తెలుస్తున్నారు. ప్రో