మీకు ఈ బ్యాంకులో ఖాతా ఉందా..! అయితే నవంబర్‌ 30 లోపు 5లక్షలు మీ సొంతం..

Business

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ

Deposit Insurance: ప్రస్తుతం దేశంలోని అనేక సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ మారటోరియం కింద నడుస్తున్నాయి. ఎందుకంటే ఈ బ్యాంకులలో ఫ్రాడ్‌ జరగడం వల్ల రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా (RBI) వీటిని నిషేధించింది. దీంతో ఈ బ్యాంకు డిపాజిటర్లు నష్టపోకుండా ఉండేందుకు త్వరలో ఒక సెటిల్‌మెంట్ చేయనుంది. వచ్చే 90 రోజుల్లో డిపాజిటర్లకు రూ.5 లక్షలు చెల్లించాలని సెప్టెంబర్ 1న ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన నవంబర్ 30, 2021 వరకు డిపాజిటర్లు వారి డబ్బును తిరిగి పొందవచ్చు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2021 ఆగస్టు 27 న సర్క్యులర్ జారీ చేసింది.

డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (DICGC) చట్టం, 2021 సెక్షన్ 1 ప్రకారం సబ్ సెక్షన్ (2) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సెప్టెంబర్ 1వ తేదీన అమలు చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో ఆ డిపాజిటర్లందరు రూ.5 లక్షలు పొందుతారు. అయితే బ్యాంక్ డిపాజిట్ గ్యారెంటీ చట్టం ఆమోదం పొందకముందే మారటోరియంపై నడుస్తున్న బ్యాంకుల డిపాజిటర్లకు కూడా రూ.5 లక్షలు అందుతాయి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ మారటోరియంలో నడుస్తున్న బ్యాంకులలో గుణలోని గ్రాహా కో-ఆపరేటివ్ బ్యాంక్, మధ్యప్రదేశ్‌కు చెందిన దక్కన్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, విజయవాడ, నాసిక్‌లోని ఇండిపెండెన్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పేర్లు ఉన్నాయి.

ఇందుకోసం కేంద్ర ఆర్థిక శాఖ 90 రోజుల కాలాన్ని 45-45 రోజులుగా విభజించింది. బ్యాంకులు మొదటి 45 రోజుల్లో తమ డిపాజిటర్ల రికార్డులను సేకరించి ఈ సమాచారాన్ని DICGC కి ఇస్తాయి. మిగతా 45 రోజుల్లో DICGC అన్ని క్లెయిమ్‌లను ప్రాసెస్ చేస్తూ వస్తుంది. రూ.5 లక్షలు కస్టమర్లకు తిరిగి చెల్లిస్తుంది. గతంలో బ్యాంకులు ముంచేసిన డబ్బులు పొందడానికి 8-10 సంవత్సరాలు పట్టేది కానీ ఇప్పుడు అదే పని 90 రోజుల్లో కంప్లీట్‌ అవుతుందని ఇటీవల ఆర్థిక మంత్రి తెలిపారు. ఖాతాదారులకు 5 లక్షల రూపాయలు, బ్యాంకులో డిపాజిట్ చేసిన ప్రిన్సిపల్ అమౌంట్‌, వడ్డీ ఇవ్వాలనే నిబంధన ఉంది. ఎక్కువగా PMC బ్యాంక్ దీని ప్రయోజనాన్ని పొందుతుంది.

Related Posts

Business

ఓపెన్‌ఏఐ 150 బిలియన్ డాలర్ల మూల్యంతో నిధుల సేకరణ చర్చల్లో – బ్లూమ్‌బర్గ్ న్యూస్ నివేదిక

చాట్‌జీపీటీ వంటి పాపులర్ చాట్‌బాట్‌ని రూపొందించిన ఓపెన్‌ఏఐ, సుమారు 6.5 బిలియన్ డాలర్లను పెట్టుబడిదారుల నుండి సేకరించేందుకు చర్చిస్తున్నట్లు నివేదిక తెలిపింది. ఈ నిధుల సేకరణకు సంబంధించి బ్యాంకుల నుంచి మరో 5 బిలియన్

Business

నిఫ్టీ 50 25,000 మార్క్‌ను తిరిగి పొందింది; ఐటీ, ఔషధ రంగ స్టాక్స్ ఆధారంగా సెన్సెక్స్ ర్యాలీ

మంగళవారం నాడు నిఫ్టీ 50 సూచీ 25,000 మార్క్‌ను దాటింది, అలాగే సెన్సెక్స్ కూడా వాల్ స్ట్రీట్‌లో లాభాలు నమోదు కావడంతో ర్యాలీ చేసింది, ఔషధ రంగ స్టాక్స్ కూడా పెరిగాయి. ఈ పెరుగుదల

Business

టాటా పవర్‌ షేర్లపై దృష్టి: తమిళనాడులోని టాటా గ్రూప్‌ సంస్థ సౌరకణాల ఉత్పత్తిని ప్రారంభించింది

మంగళవారం ఉదయం టాటా పవర్ కంపెనీ లిమిటెడ్‌ షేర్లపై పెట్టుబడిదారుల దృష్టి ఉంది, ముఖ్యంగా టాటా గ్రూప్‌ సంస్థ తమ 4.3 గిగావాట్ల సౌర కణాలు మరియు మాడ్యూల్ ఉత్పత్తి ప్లాంట్‌ను తమిళనాడులోని తిరునెల్వేలిలో

Business

సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 2% పెరిగాయి, ఇండియాలో అతి పెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్ సాధన

సెప్టెంబర్ 9 న సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 2 శాతానికి పైగా పెరిగాయి, ఎందుకంటే సంస్థ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ నుండి 1,166 మెగావాట్ల (MW) భారతదేశపు అతిపెద్ద విండ్ ఎనర్జీ ఆర్డర్